Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభను డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ చేతుల మీదుగా 1971లో స్థాపించడం జరిగిందని, అప్పటినుంచి ఈ కళాశాలలో అనేక రకాలైన టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులను మహిళా విద్యార్థులకు అందిస్తున్నామని డీడీ ఏఎంఎస్ ప్రెసిడెంట్ ఉషారెడ్డి, ఉపాధ్యక్షురాలు ఉషా కందా, చైర్పర్సన్ ప్రొఫెసర్ సులోచన పేర్కొన్నారు. విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హ్యూమన్ రైట్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఈసీఈ, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యోగా అండ్ న్యూట్రీషియన్ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ వాల్యూ అండ్ పీస్ ఎడ్యుకేషన్ అనేక రకాల కోర్సులను విద్యార్థులకు అందజేస్తున్నాట్లు చెప్పారు. ఈ కళాశాలలో ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నందుకుగానూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ పొందిందన్నారు. ఈమేరకు మంగళవారం సర్టిఫికేట్ను డీడీ ఏ ఎం ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఉషాకంద ఆవిష్కరించారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందడం ఒక మైలురాయిగా చెప్పవచ్చు అని కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ ఎం సులోచన తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ప్రొపెసర్ టి.కష్ణ కుమార్ పాల్గొన్నారు.