Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జగద్గిరిగుట్ట ఎస్ఐలు రాములు, యాదగిరి అన్నారు. ఈమేరకు మంగళవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని ఉషోదయకాలనీ, చంద్రమ్మకాలనీల్లో ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు అంటే భయం వీడి ఫ్రెండ్లీ, నిర్భయంగా ఉండాలని తెలిపారు. నేరాల అదుపులో ప్రతి ఒక్కరు భాగస్వాములై పోలీసులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.