Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూర్: నల్గొండ బహుజన రాజ్యాధికార సంకల్ప సభ సక్సస్ కావడంతో ఓర్వలేక తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ కోఆర్డినేటర్ డా.ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్వేరో స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. అదేవిధంగా మండలంలోని దత్తప్పగూడెం, పాలడుగు గ్రామాల్లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తన నియోజకవర్గంలో దళితుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ పై ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. నిజాయితీ, చిత్తశుద్ధి కలిగిన ప్రవీణ్ కుమార్ పై అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ మండల ఇంచార్జి కుర్మెటి నవీన్, బిఎస్పి నాయకులు కొంగరి అరుణ, దత్తప్పగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు ముక్కెర్ల కిరణ్, బందెల శ్రీను, రుద్ర పెళ్లి గణేష్ , నరేందర్, తోంట నరేందర్, కూరెళ్ళ సందీప్, ముక్కెర్ల ప్రశాంత్, జిట్ట ప్రసాద్, కూరెల్ల చిన్న, మెంట నవీన్ ,కూరెళ్ళ ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.