Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని సుందరయ్య కాలనీలో ఆ పార్టీ మహిళాశాఖ మహాసభ సిద్దుల వెంకటమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రతి పేద కుటుంబం అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోడీ నేటికీ నెరవేర్చలేదన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని, దళిత బంధు రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు గుండువెంకటనర్సు, కూరెళ్ల రాములు, మహిళా నాయకురాళ్లు రాచకొండ రాములమ్మ, జుబేదా, శోభ, తీగల సావిత్రి, గుండు లక్ష్మీ, నీలమ్మ,సహార, నాయకులు కందుకూరి నర్సింహ, గుడిపూడి రాజు తదితరులు పాల్గొన్నారు.