Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వనస్థలిపురం పద్మావతి కాలనిలో గతవారం జరిగిన సంఘటనలో మరణించిన ఇద్దరు ప్రయివేటు కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ మరో రూ.2లక్షల చెక్లను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం అందచేశారు. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యురాలు అంజనా పన్వార్తో కలసి సైదాబాద్లోని మేయర్ మతుల కుటుంబాల ఇండ్లకు వెళ్లి ఈ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్టార్మ్ వాటర్ డ్రెయిన్లో పూడిక పనులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళలో కాంట్రాక్టర్ తీయిస్తుండగా ఇద్దరు ప్రయివేటు కార్మికులు మరణించారని అన్నారు. మరణించిన శివ, అంతయ్య కుటుంబసభ్యులకు ఇప్పటికే రూ.15 లక్షలు అందచేశామని, మేయర్ నిధుుల నుంచి మరో రూ.2లక్షలను జాతీయ కర్మాచాయి సఫాయి కమిషన్ సభ్యులాలైన అంజనా పన్వార్తో కలసి అందచేశామని తెలిపారు. ఈ రెండు కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయనున్నట్టు కలెక్టర్ కూడా స్పష్టం చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీలో ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులైన కాంట్రాక్టర్పై కేసులు నమోదు చేసి, అతనిని జైలుకు కూడా పంపినట్టు తెలిపారు. అధికారులపైనా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జాతీయ సఫాయి, కర్మచారి కమీషన్ సభ్యురాలైన అంజనాపన్వార్ బీఎన్రెడ్డి సమీపంలోని పద్మావతి కాలనీకివెళ్లి సంఘటన జరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. ఇలాంటి సంఘటన జరగడం అత్యంత విచారకరమని అన్నారు.