Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలను బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతను ప్రారంభిం చగా అక్కడ స్థానికులు అక్రమ నిర్మాణాల కూల్చివేత అడ్డుకోవడంతో పోలీసుల సహాయంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ ఉండగా అధికారు లను స్థానికులు అడ్డుకోవడంతో అక్కడికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్ పరమే శ్వర్రెడ్డి అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణం కూల్చివేత అధికారులకు సూచించారు. బీజేపీ నాయకులు అక్రమ నిర్మాణం కూల్చివేత నిరసిస్తూ ఉప్పల్ జీహెచ్ఎంసీి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు బీజేపీ నాయకులు రేవల్లి రాజురెడ్డి, దేవేందర్రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్లో జీహెచ్ఎంసి అధికారులకు, పెద్దలకు ఒక న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయం పాటిస్తూ పక్షపాత ధోరణి చూపిస్తు న్నారని వారు విమర్శించారు. భారత్నగర్లో దళిత కుటుంబానికి చెందిన 60 గజాల ఇల్లును అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసిన అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడి ఇంటి నిర్మాణాల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తేలేదని వారు హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జాజుల నాగేష్గౌడ్, మర్నేని ఫణీంద్ర, ఈగ లక్ష్మీనారాయణ, పద్మ, నామ అనిత, దువ్వాల రమేష్, సింగారం కార్తీక్, ఎదులకంటి నవీన్ గౌడ్, దయ్యాల అమరెేందర్, జస్వంత్ రెడ్డి, ఎర్ర నర్సింగ్ పాల్గొన్నారు.