Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మొబైల్ వాహనం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు వ్యాక్సినేషన్ ఇన్చార్జి డాక్టర్ సబిత తెలిపారు. బుధవారం గోషామహల్ సర్కిల్ -14లోని ఓల్డ్ ఫీల్ ఖానా ఆచార్య భవన్లో 428 మందికి కొవిషీల్డ్ ఫస్టుడోస్,సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగం బజార్ డాక్టర్ రవి కాంత్, స్టాఫ్ నర్సులు జె. శారద, టి.సుజాత. ఆర్.పి అనూష. జీహెచ్ఎంసీ సూపర్వైజర్ ప్రకాష్, ఎస్ఎఫ్ఏ మురళి, రాజిరెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు