Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
విధులకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి యాదవ బస్తీలో తన కుటుంబంతో నివాసం ఉంటున్న గుంటోజి రమేష్ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతని కుమార్తె రాణి (18)ని స్థానిక ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. మంగళవారం నాడు తండ్రి తన కూతురిని ఆస్పత్రివద్ద వదిలి, అతను డ్యూటీకి వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం తండ్రి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అనంతరం ఆమె స్నేహితులను, బంధువులను విచారించినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో తండ్రి రమేశ్ బుధవారం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఎస్ఐ ఖలీల్ పాషా దర్యాప్తు చేస్తున్నారు.