Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీ ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న తయాబ్ ఖాన్ పెద్ద కుమారుడు అయిన తహేర్ ఖాన్(26) అదే ప్రాంతంలో హనుమాన్ గుడి వద్ద పాన్ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం కూడా దుకాణం కు వెళ్లి రాత్రి బంద్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు