Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నగరంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిధులు, అనుమతులను మంజూరు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. ఈమేరకు బుధవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఢిల్లీలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర, దూలపల్లి, కొంపల్లి జంక్షన్ల వద్ద భవిష్యత్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జంక్షన్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం అవసరమైన నిధులు, అనుమతులివ్వాలని కోరారు. డెయిరీఫామ్ నుంచి సుచిత్ర మీదుగా దూలపల్లి, కొంపల్లి వరకు ఆరు లైన్లతో కూడిన 3 ఫ్లై ఓవర్లు, 10 కొలో మీటర్ల పరిధిలో ఇరువైపులా 7 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్ల నిర్మాణం 5 జంక్షన్ల అభివృద్ధికి రూ.475 కోట్లతో డీపీఆర్ను రూపొందించి ఇప్పటికే ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని వెల్లడించారు. వీటి నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి అనుమతులిచ్చి పనులు వేగంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు అవసరమైన ఫ్లై ఓవర్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చినట్లు తెలిపారు.