Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలుగౌడ్ అన్నారు. బుధవారం గాజులరామారం డివిజన్ పరిధిలోని దేవేందర్నగర్, కైసర్నగర్లలో నిర్మించిన డబుల్ బెడ్రూంలను సీపీఐ నాయకులతో కలిసి సందరించి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవేందర్నగర్లో ఉన్న 144 డబుల్ బెడ్రూంలు 95 శాతం పూర్తయి ఏండ్లు గడిచి అలాగే వదిలేశారన్నారు, కిటికిలు పగిలిపోయి గదులలో చెత్త చెదారం నిండిపోయిందన్నారు. ఇలాగే ఉంచితే ప్రజలకు ఉపయోగపడుకుండా బుజూ బంగ్లాలుగా మారే ప్రమాదం ఉందన్నారు. కైసర్నగర్లోని 690 డబుల్ బెడ్ రూం ఇండ్లలో మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికైనా డబుల్ బెడ్ రూంలను అర్హులకు ఇవ్వాలని, లేకుంటే దరఖాస్తు చేసుకున్న ప్రజలను కలుపుకోని డబుల్ బెడ్ రూంలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.కార్యక్రమంలో సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఉమామహేష్, గాజులరామారం డివిజన్ కార్యదర్శి సదానంద్, ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్, బాచుపల్లి మండల కార్యదర్శి శ్రీనివాస్, సీపీఐ నాయకులు నరేంద్రచారి, యాకుబ్, మల్లేష్, వెంకటేష్, సహదేవ్రెడ్డి, రాములు, చంద్రయ్య, నాగప్ప, బాలాజీ, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ వెంకటేష్, జావీద్, జహంగీర్, ఇమామ్ పాల్గొన్నారు.