Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) వినతి
నవతెలంగాణ-ముషీరాబాద్
సుందరయ్య పార్క్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై చర్యలు తీసుకొని, పార్కు ఇన్చార్జ్ శ్రీధర్ను సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎం)ముషీరాబాద్ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం జోన్ కార్యదర్శి మద్దెల దశరథ్ ఆధ్వర్యంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ హరికృష్ణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు ఆహ్లాదానికీ, పచ్చదనానికి పేరుగాంచిందన్నారు. కానీ నిత్యం రాత్రి కాగానే వాకర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మద్యం తాగుతూ, చిందులు వేస్తూ ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడి చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో అనేకం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుందరయ్య పార్క్ ప్రతిష్ట దెబ్బతిన్నదని, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని కోరారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని పార్క్ ఇన్చార్జి శ్రీధర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాంనగర్, ముషీరాబాద్ డివిజన్ కార్యదర్శులు జి రాములు ఎ.శ్రీరాములు, సీఐటీయూ నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.