Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్లోని నేరేడ్మెట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు డోసులు టీకా వేయించుకుంటేనే కరోనా బారి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. టీకా కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందనీ, ఈ సందర్భంలో మొబైల్ వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టీకా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిందని కార్పొరేటర్ శ్రావణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశ్విని, ఫిజికల్ హెల్త్ సెంటర్ స్టాఫ్ ధనలక్ష్మి, ఆర్పీ సరిత, బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు, ఓబీసీ స్టేట్ కార్యవర్గ సభ్యులు సంతోష్కుమార్, మురళిగౌడ్, శరత్యాదవ్, నానియాదవ్, స్కూల్ టీచర్స్ రమేష్, నవీన్, సునీల్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.