Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల ఆరోగ్యాన్ని సవాలు చేస్తున్న పొగాకు నియంత్రనకు మాచన రఘునందన్ 20 ఏండ్లుగా చేస్తున్న అసాధారమైన నిర్విరామ కృషి ఓ అనితర సాధ్యమైన సేవా తపనగా అభివర్ణించవచ్చునని రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ పేర్కొంది. వచ్చే నెలలో చండీగఢ్లో జరగనున్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ టుబాకో అండ్ హెల్త్ 21 సదస్సు కోసం సన్నాహక జూమ్ సమావేశంను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్యంపై కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, నిపుణులు మాట్లాడుతూ పొగాకు నియంత్రణ అవసరం ప్రపంచ డిమాండుగా ఉందనీ, ఆ దిశగా జరుగుతున్న కృషిలో భాగంగా నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ఔత్సాహిక స్వచ్చంద కార్యకర్తల సహకారం అవశ్యమని సూచించింది. ఎన్సీటీఓ హెచ్ 21 సదస్సులో గౌరవ ప్రతినిధిగా పాల్గొనాలని రఘునందన్ను ఆహ్వానించింది. మేడ్చల్ జిల్లా కేశవరంకు చెందిన మాచన రఘునందన్ను ఈ సదస్సులో స్వచ్చంద కార్యకర్తగా పాల్గొనాల్సిందిగా సదస్సు నిర్వాహకులు కోరారు. కాగా పొగాకు రహిత భారతావని ధ్యేయంగా చండీగఢ్ కేంద్రంగా ఉన్న స్నాతకోత్తర ప్రజా ఆరోగ్య అధ్యయన సంస్థ (పీజీఐఎమ్ఈఆర్) అధ్వర్యంలో జాతీయ సదస్సును సెప్టెంబర్ 25, 27 తేదీల్లో నిర్వహించనుంది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పొగాకు నియంత్రణ ఆవశ్యకతపై కీలకంగా జరగనున్న ఈ చారిత్రక సదస్సుకు హాజరు కావాలని కోరుతూ పౌరసరఫరాలశాఖలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్గా పని చేస్తున్న మాచన రఘునందన్కు ఆహ్వానం అందింది. బుధవారం ఈ మేరకు విషయాన్ని మాచన రఘునందన్కు సమాచారం పంపారు.