Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రవ్యాప్తంగా 14 యూనివర్సిటీల్లో పనిచేస్తూ మార్చి 2021 వరకు రిటైరైన అధ్యాపకులు ప్రభుత్వం తమకు కూడా వయోపరిమితిని 58 నుంచి 61 వరకు పెంచుతుంది అన్న ఉద్దేశ్యంతో మళ్లీ రిలీవ్ ఐయ్యారు. కానీ వీరిలో చాలామంది తమ పింఛన్ పేపర్స్ను యూనివర్సిటీకి సబిట్ చేయలేదు. దీనిపై గవర్నర్ తమిళిసై, మంతులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సే పల్లా రాజేశ్వర్ రెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు. దానికి సంబంధించిన వివిధ సంబంధిత విభాగాలకు ఎంత మంది లబ్ధిపొందుతారో, ఆర్ధిక భారం ఎంత ఎంత వరకు ఉంటుందో తెలియజేయలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. దీనికి ఉన్నత విద్యామండలి కూడా రాష్ట్ర ప్రభుత్వనికి నివేదికను సమర్పించారని సమాచారం. దీనికి సంబంధించిన ఫైల్ ఉన్నత విద్యా, ఆర్ధిక శాఖల్లో తగిన సూచనలు చేస్తూ అధికారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో అధ్యాపకులకు పదవీ విరమణ వయోపరిమితిని పెంచితే ప్రస్తుతానికి 14 యూనివర్సిటీల్లో 45 మంది అధ్యాపకులు లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయని ఒక అధ్యాపకుడు చెప్పారు. తమతోపాటు యూజీసీ పే స్కేల్ తీసుకుంటున్న డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్కు 61 వయోపరిమితి పెంచి కేవలం యూనివర్సిటీ ఆచార్యులపై వివక్షత ఏంటని వారు ప్రశ్నించారు. ఇంకోవైవు యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్స్ లేకుండా యూనివర్సిటీల మనుగడ కష్టసాధ్యం కాదని చెప్పారు.