Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ ఇంట్లో పూజలు చేసి మోసం చేసిన దుండగులు
- 5 తులాల బంగారం, రూ.11 లక్షలతో ఉడాయింపు
నవతెలంగాణ - హైదరాబాద్
క్షుద్రపూజలు చేస్తే ధనవం తులవుతారని ఆ కుటుంబాన్ని నమ్మబలికి దుండగులు బంగా రం, నగదుతో ఉడాయించిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకా రం సికింద్రాబాద్ గాంధీనగర్కు చెందిన పిల్లి జితేందర్(34) ప్రయివేటు ఉద్యోగి. మహారాష్ట్రకు చెందిన అబ్దుల్ ఘని(48) కార్పెంటర్. కుషాయిగూడకు చెందిన దస్తగిరి(35) బట్టల వ్యాపారి. ఈ ముగ్గురు కలిసి పథకం ప్రకారం మీర్పేట్లోని సర్వోదయ నగర్ కాలనీలో కష్ణవేణి ఇంటికి వచ్చి మీ ఇంట్లో అతీత శక్తులు ఉన్నాయి, పూజలు చేస్తే మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు పొంది పెద్ద ధనవంతులవుతారని, దానికి మీ ఇంట్లో పూజలు చేయాలని నమ్మబలికారు. పూజలు చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, ఉన్న నగదు మొత్తం బయట పెట్టాలని చెప్పారు. దీంతో కష్ణవేణి తన దగ్గర ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, 11 లక్షల రూపాయలు వారి ముందు పెట్టారు. పూజలు పూర్తి అయిన తరువాత మీకు అతీత శక్తులు వస్తాయని నమ్మబలికి మెల్లగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. 8నెలలు గడిచినా ఎలాంటి అతీత శక్తులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను పట్టుకుని విచారించగా చేసిన మోసాన్ని ఒప్పుకు న్నారని, వారిని రిమాండ్ తరలించామని సీిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన క్షుద్రపూజలు..
పూజలు చేస్తే అష్ట ఐశ్వర్యవంతులు అవుతామని మోసపోయిన కుటుంబ సభ్యులు జరిగిన ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక మధనపడి చివరికి 8నెలల తర్వాత మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం.. చేసిన ఒక్కరోజుకే దొంగలను పోలీసులు పట్టుకోవడం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది. ఫిర్యాదు దారులు సంఘటన జరిగినప్పుడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాన్ని బయటకు పొక్కకుండా ఉంచి దొంగలు దొరికిన తర్వాత బయటకు చెప్పారా అని పలువురు అనుమానిస్తున్నారు. ఏమైనా ప్రజలను మోసం చేసే దొంగలను పట్టుకున్నందుకు పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.