Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాయాత్ నగర్
హయత్ నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హయత్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల అధ్యక్షుడు సామిడి వంశీ వర్ధన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి, హయత్నగర్ మండల కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జెండాను గురువారం ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ స్వాతం త్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించిదని, చదువు చదువుకై పోరాడు అనే నినాదంతో అనేక పోరాటాలు చేసిన ఘనత ఏఐఎస్ఎఫ్ సంఘానిదన్నారు. నేటి విశ్వవిద్యాలయలలో రాజకీయ జోక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని, నేటి ప్రభుత్వాలు విద్యను ప్రయి వేటికరణ చేస్తూ సామాన్య జనానికి విద్యను కొనుక్కొనే విధంగా కార్పొరేటు విద్యాలయాలకు అనుమతులి వ్వడం సిగ్గుచేటని, ప్రజాసేవ చేయాల్సిన పాలకులు సామాన్య ప్రజలు ఓట్లతో గెలిచి వారినే వంచించే వారికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత విద్యార్థి సమాఖ్యదని, ఒక వైపు కరోనా మహమ్మారితో విద్యాలయాలు మూతబడి ఆన్లైన్ క్లాస్ల పేరిటి ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యం విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం మిన్నకుండా చోద్యం చూస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి, అందొజు, అఖిల్, ఉపాధ్యక్షులు అందొజు, వికాస్, అరుణ్ కుమార్గౌడ్, కోశాధికారి, యంపళ్ళ, శ్రీకాంత్ రెడ్డి, మండల ఏఐటియుసి కార్యదర్శి, సక్రు, పార్టీ నాయకులు, పి.లక్ష్మణాచారి, విద్యార్థి నాయకులు, ప్రణీత్ రెడ్డి, చక్రధర్ రెడ్డి నిఖీల్, విజరు కూమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.