Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఉత్పత్తి కులాలు, కుల వత్తులకు చెందిన సాహిత్యం వెలువడిన ప్రత్యేకించి దళిత వాదం, స్త్రీ వాదంలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తించలేదని ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో జూమ్ అంతర్జాల వేదికగా 'తెలుగు సాహిత్యం-బీసీ వాదం' అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గౌరీశంకర్ మాట్లాడుతూ జనాభాలో సగం శాతం ఉన్న బీసీ కులాల వారి జీవనం తెలుగు సాహిత్యంలో ఎంతగా వచ్చినా మరింత రావాల్సి ఉందన్నారు. వత్తి పరమైన కులాలు బీసీ వర్గాలన్నారు. రచయిత దత్తయ్య తాను పరిశోధించి బీసీ కులాల సాహిత్యంపై సోదాహరణ ప్రసంగించారు. అధ్యక్షత వహించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకర్ 20ఏళ్ల క్రితం గౌరీశంకర్ రచించిన వెంటాడే కళలు-వెనుక బడిన కులాలు' సంచలనం సష్టించిందన్నారు. విమర్శకులు బీసీ సాహిత్యాన్ని విశ్లేషించాలని కోరారు. సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి, విరసం కార్యదర్శి డాక్టర్ రవిశంకర్, సాహితీ విమర్శకుడు రఘు తదితరులు పాల్గొని మాట్లాడారు