Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మలక్పేట్
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా ను ఎగురవేస్తాం అని వైఎస్సార్ తెలంగాణ పార్ట్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ కన్వీనర్లు ముజుతాబ్ అహ్మద్, భూమి రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పార్టీ కోకన్వీనర్ అయూబ్ఖాన్ ఆధ్వర్యంలో మలక్పేట్లోని అజాం పుర డివిజన్ చంచల్గూడలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పండగ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి అందించిన పాలన ఎన్నటికీ మరువలేము అన్నారు. త్వరలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అన్నారు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం వైఎస్సార్ టీపీి అని పేర్కొ న్నారు. ప్రజలందరు పార్టీని ఆదరించాలి అన్నారు. ఆగష్టు 5 నుండి పార్ట్టీ జెండా పండగ నిర్వహిస్తున్నా మని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షే మాన్ని పూర్తిగా విస్మరిస్తుంది అన్నారు. అయూబ్ నాయకత్వంలో సుమారు 200మంది కార్యకర్తలు పార్టీ లో చేరారు. కోకన్వీనర్లు లింగారెడ్డి, మహమ్మద్ మోహిసిన్ నాయకులు రాజేందర్, అలీఖాన్, మిరాజ్, సాజిద్ సాహెడ్, హరీఫ్ ఖాన్, అక్తర్, అలీ ఖాన్, సయ్యద్, అఫ్రోజ్, ఫరెన్ తదితరులు పాల్గొన్నారు.