Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ హాస్టల్స్, మెస్ లలో పనిచేస్తున్న 357 మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టీయూ అనుబంధ ప్రొగ్రెసివ్ కాంట్రాక్టు అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ఎల్. పద్మ కోరారు. ఈమేరకు గురువారం ఓయూ రిజిస్ట్రార్ ప్రొపెసర్ పి.లక్ష్మీ నారాయణ, ఓయూ చీఫ్ వార్డెన్ డా. కొర్రెముల శ్రీనివాసరావు లకు వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. ఓయూ హాస్టల్స్, మెస్లలో సుమారు 25 ఏండ్లకు పైగా 357 మంది పనిచేస్తున్నారన్నారు. యూనివర్సిటీలోని ఉద్యోగులందరి మాదిరిగా 357 మంది హాస్టల్స్ ఉద్యోగులకు యూనివర్సిటీ డైరెక్టుగా వేతనాలు చెల్లించాలన్నారు. ఉద్యోగులందరి మాదిరిగా 12 నెలల కాలం పని చేయిస్తూ వేతనాలు చెల్లించాలన్నారు. దీంతో పాటు ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డు, మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్, క్యాజువల్ లీవ్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివక్షత లేకుండా సమానంగా చూడాలని, జీవో ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వరలక్ష్మి, భారతి, జయ, అనుపమా, రహమాన్, వాణి పాల్గొన్నారు.