Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
'అవయవ దానం అనేది మరొకరి జీవితానికి పునర్జన్మ. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడగలడు. గుండె, ఊపిరితి త్తులు, కాలేయం, మూత్రపిం డాలు, క్లోమం, ప్రేగు, అవయవాలు, చర్మం, కార్నియా, ఎముకలు ఒకే దాత నుండి ఉపయోగించగల అవయ వాలు ఇవి. భారతదేశంలో 1994లో అవయవ దానాన్ని చట్టబద్దం చేసి ఆమోదించబడింది. కొన్నేండ్లుగా అవయ వ దానాలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ పశ్చిమ దేశాల తో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని నివేద కలు చెబుతున్నాయి. దేశంలో మిలియన్కు 0.86, స్పెయిన్తో పోలిస్తే అత్యధికంగా అవయవ దానం మిలి యన్కు 46.9. ప్రతి ఏడాదీ 2.20లక్షల మంది రోగులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో, 2.50లక్షల మంది దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో మరణిస్తున్నట్టు అంచ నా. కనీసం 20శాతం వాటిని సకాలంలో మార్పిడి ద్వారా సేవ్ చేయవచ్చు. అందువల్ల అవయవదానానికి డిమాండ్, సరఫరా మధ్య విస్తత అంతరం ఉంది' అని కిమ్స్ హాస్పిటల్ చీఫ్ హెచ్పీబీ,లివర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ రవిచంద్ సిద్దాచారి అన్నారు. చాలా మంది అవగాహన లేకపోవడం, మతపరమైన నమ్మకాలు, మూఢనమ్మకాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై విశ్వాసం లేకపోవడం వంటి కారణాలతో అవయవదానం చేయలేకపోతున్నారని చెప్పారు. బ్రెయిన్ డెత్ ఐడెంటిఫికేషన్, డిక్లరేషన్కు శిక్షణ పొందిన వైద్యులు, కో-ఆర్డినేటర్లు అవసరముందన్నారు. అనేక ఆస్పత్రుల్లో సంభావ్య దాతలు ఉన్నా కానీ శిక్షణ పొందిన వైద్యులు లేకపోవచ్చనీ, వారు ఆసక్తి చూపకపో వచ్చని తెలిపారు. బ్రెయిన్ డెడ్తో మృతి చెందిన రోగు లకు ఐసీయూ సంరక్షణ అవసరమనీ, కొన్నిసార్లు అలాం టి రోగిని ఉంచడానికి తగిన నిధులు ఉండకపోవచ్చన్నారు.