Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ గ్రామంలోని శ్రీబంగారు మైసమ్మ ఆలయ వార్షిక మహోత్సవం కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రజలపై తప్పక ఉంటాయని పేర్కొన్నారు. అమ్మవారి కపతో యావత్ ప్రపంచం కరోనా నుంచి బయటపడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగరాజ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ మిద్దెల బాల్ రెడ్డి, నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మెన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రవి యాదవ్, బుచ్చిరెడ్డి, మురళి యాదవ్, విష్ణు వర్ధన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.