Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కమలా హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళ కడుపులో నుం సుమారు 5 కిలోల కణితిని వెలికి తీశారు. హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ అశా అశోక్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని వల్లబ గ్రామానికి చెందిన 45 ఏండ్ల ప్రమీల కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వివిధ హాస్పిటళ్లు తిరిగినా లాభం లేక పోవడంతో నగరంలోని కమలా హాస్పిటల్ వైద్యులను సంప్రదించగా పరీక్షలు నిర్వహించి ప్రముఖ వైద్యులు డాక్టర్ బీఎస్ రావు, డాక్టర్ అశోక్ బృందం ఆపరేషన్ నిర్వహించి కణితి తొలగిం చారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ అన్ని రకాల వసతులతో కూడిన వైద్యం అందించేలా తమ ఆస్పత్రి కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.