Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులు సందర్శించారు. గౌతమ్నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరోనాకి కేంద్రంలో సదుపాయాల గురించి ఈ సందర్భంగా అక్కడ సిబ్బందిని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ దేశ వ్యాప్తంగా ఉచితంగా టీకాలు అందజేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్రెడ్డి సూచనలతో హెల్త్ సెంటర్లో టీకా కేంద్రాన్ని పరిశీలించామనీ, టీకా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, దివాకర్, వాసుదేవ్, మల్లారెడ్డి, ఎం.రామ్చందర్, గన, స్వర్ణలత, వెంకటకిషోర్, బలరాం, గణేష్యాదవ్, మంజుల, రాజేష్, ప్రకాష్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.