Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లాలోని కాళ్ళకల్ వరకు జాతీయ రహదారి (నేషనల్ హైవే) 44ను నాలుగు లైన్ల రహదారి నుంచి ఆరు లైన్ల రహదారికి విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు ఆస్తులు కోల్పతున్నట్ల యితే వాటికి సంబంధించిన వివరాలను అందిం చాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి హరీశ్ అధికారులకు తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరే ట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథారిటీ) ఈ మేరకు మేడ్చల్ జిల్లా బోయిన్పల్లి నుంచి మెదక్ జిల్లాలోని కాళ్ళకల్ వరకు విస్తరణ పనులు చేపడుతోందనీ, దీనిలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వెడల్పు కానుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు 30 మీటర్ల వెడల్పులో ఉందనీ, దీన్ని పదిహేను మీటర్లు పెంచుతూ 45 మీటర్ల రోడ్డుగా విస్తరిస్తున్నారని వివరించారు. ఈ మేరకు రోడ్డుకు రెండు వైపులా ఏడున్నర మీటర్ల మేర విస్తరణ జరుగుతుందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు రహదారి పనుల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా పైపులైన్లకు సంబంధిత ఏజెన్సీకి అంచనాలు ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సూచించారు. ఆయా జాతీయ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించ డంలో ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు చొరవ చూపాలన్నారు. రహదా రుల విస్తరణలో ఏర్పడే సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. విస్తరిస్తున్న ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, బీఎస్ఎన్ఎల్ శాఖలకు సంబంధించి కొన్ని ఇబ్బం దులు, డ్యామేజీలు అవుతున్నందున లైన్లను పక్కకు జరిపి రోడ్డు వెడల్పులో భూములు కోల్పోతున్న వివరాలకు సంబంధించి త్వరితగతిన సర్వే చేపట్టి అంచనా నివేదిక తదితర వివరాలను అందచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, జెడ్పీ సీఈవో దేవసహాయం, ఆర్డబ్ల్యుఎస్ అధికారి ట్రాన్స్కో అధికారి అటవీశాఖ అధికారులు ఆర్డీవో రవి, మల్లయ్య ,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.