Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి శుక్రవారం వార్డు -7 పెద్దకమేల బస్తీ దవాఖానలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మర్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోవిడ్ మహమ్మారిని నియంత్రించడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందనీ, వాటి ఫలితాలను మనం నేడు చూస్తున్నామని తెలి పారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ వార్డ్-7 బోర్డు మెంబెర్, మాజీ మెంబర్ శ్యామ్ కుమార్, విశ్వనాథ్, రాజు, సంజీవ్, పోచయ్య, వినోద్, మహేష్, నరేష్, గౌరీ శంకర్, డాక్టర్ శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.