Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మీర్పేట్ కార్పొరేషన్ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి కార్యక్ర మాలు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రతి నెలా రూ.140 కోట్లను మున్సిపాలిటీలకు కేటాయించారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో స్మశాన వాటి కలు, మార్కెట్ యాడ్స్ను నిర్మించనున్నామనీ, ఒక్కొ క్క స్మశానవాటిక అభివృద్ధికి రూ.కోటి ప్రత్యేక నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో రెండు వైకుంఠ దామలు అభివృద్ధి చేసేందుకు రూ.రెండు కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్పొరేషన్ లో అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీఈ గోపీనాథ్, స్థానిక కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.