Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ పట్టణ కేంద్రంలో రోడ్డు వేయాలని బీజేపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను కాలనీ అధ్యక్షులతో కలిసి మచ్చ బొల్లారం డివిజన్ ప్రకాష్ చౌదరి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అల్వాల్ మున్సిపాల్టీ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ ప్రధాన రహదారి అల్వాల్ నుంచి కొంపల్లికి వెళ్లే దారి ఏడేండ్ల నుంచి రోడ్డు వేయాలలని కోరుతున్నట్టు తెలిపారు. రోడ్డు బాగా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నా నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ రోడ్డు వర్షం పడితే నడిచే పరిస్థితి లేదనీ, వాహనాల పైన వెళ్లే సమయంలో కింద పడి గాయాలైన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పదించి తక్షణమే రోడ్డుకు నిధులు మంజూ రు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు ప్రకాష్ చౌదరి, జనరల్ సెక్రెటరీ నవీన్ చౌదరి, బీజేపీ సీనియర్ నాయకుడు దండుగుల వెంకటేష్, అరుణ్ రాజ్ శాస్త్రి, అమర్ నవీన్ ముదిరాజ్, నాగరాజ్, భాస్కర్, ఉదరు, ప్రకాష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.