Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-అంబర్పేట
మహిళల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో రూ.3 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన బాలిక సదన్ భవనాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక సదన్ నూతన భవనం అత్యాధునిక వసతులతో నిర్మించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు, బాలికల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్యదేవరాజన్, జువైనల్ హోమ్స్ డైరెక్టర్ శైలజ, కలెక్టర్ శర్మన్, సూపర్వైజర్ మైథిలి, సిబ్బంది నిర్మల, సంధ్య, ప్రవల్లిక, సుగుణ, సంగీత, అస్మత్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగ్యాదవ్, రాము, ఆర్.కె.బాబు, ఉమేష్, రాజు, ప్రణీత్, యూసుఫ్ పాల్గొన్నారు.