Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యేలా సంబ ంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనులు పూర్తయ్యేలా చూడాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోఇ సమా వేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, పంచా యతీరాజ్, జిల్లా ముఖ్య ప్రణాళిక (సీపీవో), జిల్లా పంచాయతీశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ది, మున్సి పల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంత మేరకు టీకాలు ఇచ్చారు? ఇంకా ఎంత మందికి టీకాలు ఇవ్వాల్సి ఉందనే వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావును అడిగారు. జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో కరోనా వ్యాక్సిన్ టీకాలు అంజేచేస్తున్నా మనీ, ఎప్పటికప్పుడు కరోనా వివరాలను తెలుసు కుంటున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తమ శాఖ అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాలో ఎన్ని చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి, ఇప్పటి వరకు ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి? ఇంకా ఎన్ని నిర్మా ణాలు ఏఏ దశల్లో ఉన్నాయనే వివరాలను పంచాయతీరాజ్ ఈఈని అడిగి తెలుసుకున్నా రు. డబుల్ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయా లనీ, ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే జిల్లాలోని గ్రామపంచాయతీల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలు, వాటి పురోగతి, ఇంకా ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నాయా అనే వివరాలను జిల్లా పంచాయతీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు సోకుతున్నందున గ్రామపంచాయతీల్లో పరిశుభ్రత పాటించాలనీ, ఈ విషయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించడంతోపాటు అధికారులు ఆకస్మికంగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. వీటితో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం పట్టణ ప్రగతి పనులను ఎంత మేరకు జరిగాయనే వివరాలను సంబంధిత మున్సిపల్ కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే పట్టణ ప్రగతిలో మురికి కాల్వలు, కరెంట్ స్తంభాలు, వైర్ల మార్పిడి తదితర పనులు కొన్ని పెండింగ్లో ఉన్నాయనీ, వాటి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లు, అధికారులను కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. జిల్లాలోని గ్రామపంచా యతీలు, మున్సిపాలిటీల్లో అనుమతి ఉన్న లే అవుట్లు ఎన్ని ? అక్రమ లే అవుట్లు ఎన్ని ? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, డంపింగ్ యార్డుల పనులు ఎంత వరకు వచ్చాయనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తనకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనం తరం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్ రావు మాట్లాడుతూ సీఎం దత్తత గ్రామాల్లో పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఏయే పనులు చేపట్టారు? ఏఏ దశల్లో ఉన్నాయనే వివరాలను కలెక్టరుకు వివరించారు. గ్రామాల్లో పనులు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులకు సంబం ధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి నిధుల కొరత ఉంటే సంబం ధించిన ప్రపోజల్స్ పంపితే నిధులు కొరత లేకుండా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్, డీఆర్వో లింగ్యా నాయక్, జెడ్పీ సీఈవో దేవసహాయం, పంచా యతీరాజ్ ఈఈ, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.