Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
వేరే భాషా సాహిత్యల్లో లేని పద్య ప్రక్రియ తెలుగు భాష సొంతమని, తెలుగు సంపద అని ఆంధ్రప్రదేశ్ శాసన సభ పూర్వ ఉప సభాపతి మండలి బుధప్రసాద్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళావేదికపై బుధవారం సాధన సాహితీ స్రవంతి నిర్వహణలో డాక్టర్ రాధాశ్రీ రచించిన 'రామణాచార్య శతకం' ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిóగా బుధప్రసాద్ పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు శతక పద్యాలను రాసి భాషను సుసంపన్నం చేశారన్నారు. వేమన సుమతీ శతక పద్యాలు నీతి బోధకాలన్నారు. రాధశ్రీ అత్యంత ప్రతిభావంత పద్యకవి అని రమణాచారి గురించి పద్య రూపంలో ఆయన వ్యక్తిత్వాన్ని అవిష్కరించారని అభినందించారు. సాహితీవేత్త డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాధశ్రీ ఆశువుగా పద్యాలను అలవోకగా చెప్పగలరన్నారు. ఎంచుకున్న విషయం రమణపై సుందరంగా ఆయన జీవితాన్ని పద్య రూపంలో వివరించారన్నారు. కవి రాధశ్రీ తన శతక సంపుటిని డాక్టర్ రమణకు లాంఛనం గా అంకితమిచ్చారు. రమణ తన స్పందనలో రాధశ్రీ పద్య ప్రతిభను కొనియాడారు. గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి, సాహితీవేత్త డాక్టర్ వోలెటి పర్వతీశంపాల్గొనగా సాధన నరసింహచార్య కార్యక్రమాన్ని నిర్వహించారు.