Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
కార్మికుల సమస్యలపై చలో హుజురాబాద్ శంఖా రావం బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి సభను విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చింతల యాదయ్య అన్నారు. ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణంలో బుధవారం బహిరంగ సభ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా చింతల యాదయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయితీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. దళిత ఎంపవర్మెంట్ సమా వేశంలో ముఖ్యమంత్రి కేసీిఆర్ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. కార్మికుల సమస్యల కోసం స్వచ్ఛందంగా కదిలి బహిరంగ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీిఐటీయూ జిల్లా కోశాధికారి ఎన్.సబిత, యూనియన్ నాయకులు గంగమ్మ, పద్మ, స్వరూప, ఇందిరమ్మ, భాగమ్మ, పెంటమ్మ, లక్ష్మయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.