Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మలక్పేట్
నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకో వాలి అని రంగారెడ్డి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్కె పురంలోని శివాని మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమానికి అయన ముఖ్యఅతిథిóగా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడు తూ విద్యార్థులు కళాశాల దశలో లక్ష్యాన్ని ఏర్పరుచు కొని లక్ష్యసాధనకు కషి చేయాలి అన్నారు. విద్యార్థులు చదువు పూర్తి అయిన తర్వాత సమయం వధా కాకుండా ఉద్యోగంలో స్థిరపడాలి అన్నారు. అనంత రం కళాశాల కరెస్పాండెంట్ వెదిరె సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాల్లో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాం అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మేళాలో దాదాపు 1300 మంది హాజరు అయ్యారు అని, వారిలో 520 మందిని షార్ట్ లిస్ట్ చేసారు అన్నారు. ఓజాస్ ఇన్నోవేట్ టెక్నాలజీస్, వర్చస్ ఐటీ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి, ఆక్సిస్ బ్యాంక్, బిగ్ సి, కార్వి, అపోలో ఫార్మసీ, లాంటి కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని వారికి కావలిసిన నైపుణ్యం ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, కళాశాల అడ్మిన్ ఆఫీసర్ ఎం.సత్తి రెడ్డి, వివిధ కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు.