Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
అందరి సహకారంతో మండలాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసుకుని ఆదర్శ మండలంగా మూడు చింతలపల్లిని తీర్చిదిద్దుతామని, అందరూ సహకరించాలని ఎంపీపీ హారిక మురళీగౌడ్ అన్నారు. బుదవారం మూడు చింతలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనందాస్, హరికమురళీ గౌడ్, అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా లక్ష్మాపూర్, జగన్ గూడ, గ్రామాల రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ రాజేశ్వర్రెడ్డి దష్టికి ఆయా గ్రామాల సర్పంచులు తీసుకెళ్లగా త్వరలో సమస్యలు పరిష్కరం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యలపై ఆ శాఖ అధికారి నిర్లక్ష్యం చేస్తున్నారని పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పల్లె ప్రగతి పనులు పూర్తి చేసినందుకు మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను ఎంపీపీ, ఎంపీడీవోలు వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సువిధ, ఎంపీవో రవినాయక్, డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గోనె హనుమంత్రెడ్డి, సర్పంచులు జాం రవి, విష్ణువర్ధన్ రెడ్డి, శిల్పయాదగిరి, హరిమోహన్రెడ్డి, జ్యోతి, కపాకర్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాజు, అఖిలేష్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ గౌస్ పాషా, వివిధ శాఖల అధికారులు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.