Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సర్వాయి పాపన్న 371 జయంతి ఉత్సవాన్ని నగర టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పి.సాయిబాబా మాట్లాడారు. మోఘల్ పాలనా మీద తొలిసారిగా తిరుగుబాటు చేసిన మహానీయుడు సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. ఆ తిరుగుబాటుతో బహుజనులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయన చూపిన ఆశయాలు, సాగించిన పోరాటాలు ఈనాటి తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. మహానీయుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు (వర్కింగ్ ప్రసిడెంట్) నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శులు పి.బాలరాజ్ గౌడ్, కె.కొమురన్న, బిల్డర్ ప్రవీణ్, రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, నాగు నగేష్, రాజేంద్రప్రసాద్, కట్ట రాములు, ఆర్.బాస్కర్, జి.మధుసూదన్, చంద్రమోహన్ గౌడ్, గుట్ట అనిల్ కురుమ, యాదగిరి రావు, వైఎల్.నిర్సింహా గౌడ్, రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.