Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు మల్కాజిగిరిలో ఘనంగా జరిగాయి. బుధవారం మల్కాజిగిరి చౌరస్తా శుభం ఫంక్షన్ హాల్లో నరసింహగౌడ్, సదానంద్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు వెంకట నర్సయ్య, నియోజకవర్గ సీనియర్ నాయకులు వికే మహేష్, నందికంటి శ్రీధర్ ముఖ్య అతిధులుగా పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బహుజన జాతులకు స్ఫూర్తి నింపిన యోధుడనీ, ఆయనే స్ఫూర్తిగా బహుజనులు ఐక్యమై అధికారం సాధించేందుకు కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు అభ్యుదయవాది పబ్బు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ వరంగల్ కిలాశాపుర్ గ్రామంలో సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న రాజ్య మేలడం నాటి గొప్ప చరిత్ర ఆనాటి రాచరిక, భూస్వామ్య, దోపిడీ పీడనపై తిరుగుబాటు చేసి విజయాలు సాదించిన మహా యోదుడు పాపన్న అని అయన పేర్కొన్నారు. సబ్బండ పీడిత, తాడిత జాతులతో సైన్యం ఏర్పాటు చేసి దక్షిణ భారతదేశంలోని ఎన్నో సంస్థానాలను స్వాధీనం చేసుకొని అనాడే పేదల సంక్షేమ రాజ్యం సాధించిన మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న అని ఈ సందర్బంగా మల్లేష్ గౌడ్ వివరించారు. పాపన్న స్ఫూర్తితో తెలంగాణలో బడుగు బహుజనుల ఐక్యత సాధించే లక్ష్యంతో పని చేద్దామని ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అతిథులకు సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో అజరుగౌడ్, సంపత్గౌడ్, ప్రమోద్గౌడ్, శ్రీధర్ గౌడ్, బత్తిని సత్తయ్య, కృష్ణ గౌడ్ సుదర్శన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లింగం గౌడ్, ధర్మ తేజ, సొసైటీల సభ్యులు పాల్గొన్నారు.