Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రభుత్వ విద్యారంగపై సర్కార్ నిర్లక్ష్యం వీడాలని, ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్లక్ష్యంపై నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు రోడ్డుపై కూర్చొని చదువుతూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాలలను పునర్ ప్రారంభించాలని, ప్రతి విద్యార్థికీ వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు మూతపడటంవల్ల ఇప్పటికే చాలామంది పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. విద్యార్థి నాయకులు ప్రదీప్ భుజంగం ధనుష్, నిఖిల్, ఉదరు ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.