Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
శిశువుల్లో న్యూమోనియా నివారణకు న్యూ మోకొకల్ కంజు గేట్ వ్యాక్సిన్ (పీసీవీ) వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, కింగ్ కోఠి క్లస్టర్ ఎస్పీహెచ్వో డాక్టర్ పద్మజా అన్నారు. బుధవారం బొగ్గులకుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీసీవీ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారుల తల్లిదండ్రులు తొలి నెలన్నర శిశువుకు మొదటి డోస్ ఇప్పించాలని, రెండో డోస్ ముడున్నర నెలకు, బూస్టర్ డోస్ తొమ్మిది నెలలకు ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూకబుల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక, పీహెచ్ ఎన్ లలిత, ఏఎన్ఎం కష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.