Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ. గాలివినోద్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్యం, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ధనికులు పేదల మధ్య సంపన్న ఆధిపత్య వర్గాల పీడితుల మధ్య రోజురోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయని, దాని కారణంగా వివక్షత కొనసాగి ప్రపంచ హింస కు దారితీస్తుందని ఓయూ, టీయూ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ గాలి. వినోద్ కుమార్ అన్నారు. గురువారం సీఎస్ఐ క్రైస్తవ డయాసిస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన 'అంతర్జాతీయ మానవత్వా దినోత్సవం'' ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచంలోని ఆధిపత్య దేశాలైన అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ వారి వాణిజ్య అవసరాల కోసం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, న్యాయ చట్టాలు చట్టాలు తమకు అనుకూలంగా చేసుకొని ఐక్యరాజ్యసమితి తీర్మానాలను లెక్కచేయకుండా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, అరబ్ మధ్య ఆసియా పేద దేశాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోడానికి కాకుండా మానవత్వాన్ని మన విలువల్ని మానవ హక్కులు మంట కలుపుతున్నారని, అందుకే మానవతా దినోత్సవం సందర్భంగా మానవజాతి ఒకటిగా ఏకమై తమ తొలగించుకొని సమ సమాజ నిర్మాణం వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సెంథిల్ కుమార్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నెల్సన్ స్వామినాథన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కమల ఫ్లారెన్స్ పాల్గొన్నారు.