Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట్
మూఢ నమ్మకాలు మనిషి మనుగడకు ఆటంకం కలిగిస్తాయని, అజ్ఞానంలోకి నెడతాయని, కాబట్టి వాటిని వదులుకుని వాస్తవాల ఆధారంగా జీవించాలని శామీర్పేట్ శామీర్పేట సీఐ సుధీర్ కుమార్ అన్నారు. గురువారం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగంగూడలో సైబరాబాద్ కమిషనర్ వి.సి.సజ్జనార్ నేతత్వంలో ''సైబరాబాద్ జాగతి కళాబందం ఆధ్వర్వర్యంలో మూఢ నమ్మకాల నివారణకోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు మూఢ నమ్మకాలను, అవాస్తవాలను నమ్మి మోసపోవద్దని,చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి తమ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని, ఆడపిల్లలకు చిన్న వయస్సులో పెండ్లిల్లు చేయవద్దని సూచించారు. యువకులు చదువుకోవలసిన వయస్సులో మద్యపానం, గంజాయికి అలవాటుపడి చెడు మార్గం పడుతూ.. యువత తమ తల్లిదండ్రుల ఆశలను నీరు గారుస్తున్న సందర్భాలుంటున్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు మైనర్లు అయిన తమ పిల్లలకు బైకులు కొనివ్వడం ప్రమాదకరమని,అవగాహన, అర్హతలేని తనంతో బైకులు నడిపి ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడటమేగాక, తమ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తారన్నారు. టూవీలర్ నడిపేవారు, వెనుక కూర్చున్నవారు ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కు స్పందించ కూడదని, ఎట్టి పరిస్థితులలో వారికి ఓటీపీ, పాస్వర్డ్లు చెప్పవద్దని తెలిపారు. బాల్య వివాహాల నివారణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. జాగతి కళాబంద సభ్యులను ఈ సందర్భంగా సి.ఐ సుధీర్ కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శామీర్ పేట్ ఎస్సైలు ఎస్. వీరశేఖర్, రవికుమార్, గణేష్, రామ్ చందర్, సిబ్బంది లతో పాటు సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు సాయి బాబు, శివ రమేశ్, వీరా రెడ్డి, నరేందర్ రెడ్డి, శంకర్ గుప్తా, యెల్ల కుమార్, గ్రామ పెద్దలు , యువజన సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.