Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెస్పాండంట్ వెదిరె సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ - మలక్పేట్
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని శివాని మహిళా కళాశాల కరస్పాండంట్ వెదిరె సుదర్శన్ రెడ్డి అన్నారు. ఒకటవ తెలంగాణ రాష్ట్ర అండర్ 23 మెన్ అండ్ ఉమెన్ అథ్లెటిక్స్ ఛాంపి యన్షిప్ 2021 జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో శివాని జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ మొదటి సంత్సరం చదువుతున్న కొర్ర అఖిల స్వర్ణ పథకం, ఇంటర్ మొదటి సంత్సరం చదువుతున్న ఎన్.విజయ లక్ష్మి సిల్వర్ పథకాలను రాష్ట్రస్థాయి పోటీలో సాధించ డంతో సోమవారం ఆర్కెపురంలోని కళాశాలల్లో ఘనంగా సన్మానించారు. సుదర్షన్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో చదివే విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణం అన్నారు. విద్యార్థులకు విద్యాబోధన పాటు, క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను నేర్పిస్తాం అన్నారు. ప్రతి విద్యార్థిని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సాహం అందిస్తాం అన్నారు. ప్రతి సంత్సరం తమ కళాశాలల్లో జరిగే క్యాంపస్ ప్లేస్మెంట్లో చాలా మంది విద్యార్థు లు ఎంపిక అవుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనిత, కాలేజీ అడ్మిన్ ఆఫీసర్ సత్తిరెడ్డి, అధ్యాపక బందం పాల్గొన్నారు.