Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద వేస్తున్న చెత్త వల్ల వాదీ ఏ ముస్తఫా బస్తీ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు పట్టిించుకోవడం లేదని వార్డు కౌన్సిలర్ షేక్ ఫమీదఅఫ్జల్ ఆరోపిస్తున్నారు. సోమవారం కౌన్సిలర్ మీడియాతో మాట్లాడుతూ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 28 వార్డులకు సంబంధించిన చెత్తను మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా తీసుకొని వచ్చి వాదీఏ ముస్తఫా బస్తీ దగ్గర గల జల్పల్లి పెద్ద చెరువు వద్ద చెత్త వేయడం వల్ల ఈగలు, దోమలు పెరిగిపోయాయని, దోమలు కాటు వేయడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకుపోయిన చెత్త నుంచి వచ్చే మురికి నీరు చెరువులో కలుస్తున్నా యని దీని వల్ల చెరువు నీరు పూర్తిగా కలుషితమై చేపలు మతి చెందే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు.
ఈ విషయంపై కమిషనర్కు ఫిర్యాదు చేస్తే చెత్త డంపింగ్కు స్థలంలేదని చెపుతున్నారన్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్, షాహీన్ నగర్, పహాడీ షరీఫ్, శ్రీరాం కాలనీలకు చెందిన చెత్తను అయా వార్డుల్లోనే డంప్ చేయాలని కోరారు. లేనిచో వాదీ ఏ ముస్తఫా బస్తీలో మళ్ళీ డెంగీ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని, అధికారులు వెంటనే ఇక్కడి నుంచి చెత్తను తరలించాలని కోరుతున్నట్లు తెలిపారు.