Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి రాజీనామా చేయటంతో హుజూరాబాద్కు ఏ విధంగా ప్రభుత్వం రెండు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారని, దీనితో దళితులు ఎంతో అభివద్ధి చెందుతారని, అదేవిధంగా మహేశ్వరం నియోజక వర్గం దళితులు సైతం అన్ని విధాలుగా అభివద్ధి చెందుతారని మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్రెడ్డి అన్నారు. సోమవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్్గూడలోని 5వ డివిజన్లో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా 5వ డివిజన్లో మారుతీనగర్ కాలనీలో పార్కు స్థలాలను కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేయటానికే కాలనీవాసులతో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపించారు. ఈ సమావేశంలో రామిడి శ్రీనివాస్రెడ్డి, నిరంజన్ రెడ్డి, అర్.వినోద్ నాయక్, రంజిత్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.