Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలోని బాలింతల వార్డులో ప్రేరణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ శరత్ సుదర్శి మాట్లాడుతూ.. నిరుపేదల కడుపు నింపాలనే ఆలోచనతో ప్రేరణ మీల్స్ ను ప్రారంభించామన్నారు. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులవద్ద సహాయంగా వారు సమయానికి భోజనం అందక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి భోజనాలు అందిస్తున్నామని తెలిపారు. అలాగే రోడ్లపైన, ఫుట్పాత్లపైన ఆకలితో అలమటించే అనాథలకు, నిస్సాహాయులకు దాతల సహకారంతో ఆహారాన్ని అందజేస్తున్నామని చెప్పారు. దాతలు ముందుకొచ్చి సహకరిస్తే తిండికిలేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదల కడుపునింపుతామన్నారు. ప్రేరణ మీల్స్కు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.