Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలోని ప్రతి బస్తీ, కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని ఓల్ట్ సీబీఐ క్వార్టర్స్లో ఏర్పాటుచేసిన స్పెషల్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో టీకా వేయించుకోకుండా ఉన్న 4,846 కాలనీలు, స్లమ్స్ ఏరియాలో వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ మాప్ఆప్ డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రత్యేక టీమ్లు ప్రతి ఇంటిని సందర్శించి వ్యాక్సినేషన్ వేయించుకునేలా ప్రజలను అవగాహన కల్పిస్తారన్నారు. వ్యాక్సినేషన్ పూర్తికాగానే ఆ ఇంటి తలుపుల మీద ప్రత్యేక స్టిక్కర్ అతికిస్తారన్నారు. వందశాతం వ్యాక్సినేటేడ్ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ప్రత్యేక మాప్అప్ డ్రైవ్ చేపట్టామని వివరించారు. ప్రభుత్వం కల్పించిన ఈసదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, అపోహలకు పోవద్దని ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డాక్టర్ అనురాధ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.