Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాం గులకు మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జైజవాన్ కాలనీ మైన్ రోడ్ దగ్గర సోమవారం గేెజిట్ నోటిఫికేషన్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ వికలాంగుల పాలిట శాపంగా మారిందన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం లోని సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు 4శాతం రిజర్వే షన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత శాఖ ఏకప క్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షలాది మంది వికలాంగుల బ్యాక్లాక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేయకుండా కొత్త ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయకుండా, వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని గొప్పలు చెబు తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివే టుపరం చేయడం ద్వారా రిజర్వేషన్లు అమలు కాక అనేక మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మినిస్టీ రియల్ నియామకాలు అన్నింటిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అమలు అవుతున్నా యనీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ద్వారా మినిస్టిరియల్ ఉద్యోగాలు వికలాం గులు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసెస్, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని ఉద్యోగ నియామకాల నుంచి వికలాంగులను మినహాయించాలని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనడం చట్టవిరుద్ధం అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టానికి భిన్నమైందనీ, తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ రైల్వే, బీఎస్ఎన్ఎల్ లాంటి సంస్థల్లో ఒక శాతం మంది కూడా విక లాంగ ఉద్యోగులు లేరని తెలిపారు. వికలాంగుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుందనీ, వికలాంగు లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లను కూడా ఎందుకు రద్దు చేస్తుందని ప్రశ్నించారు. దివ్యా ంగులు అంటూ ఒక వైపు ప్రచారం చేస్తూనే మరోవైపు పోరాడి సాధించుకున్న హక్కులను తీసివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు కాక అనేక మంది నిరుద్యోగ వికలాంగులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకు ంటున్నారని తెలిపారు. నిరుద్యోగ వికలాంగుల ఆత్మహత్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దేశ వ్యా ప్తంగా వికలాంగుల చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు. చట్టాల మార్పు కుట్రలో భాగమే కేంద్రం తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికే షన్ అనీ, గెజిట్ నోటిఫికేషన్ రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో మహిళా కన్వీనర్ కె నాగలక్ష్మి, షేన్బేగం, అమరావతి, నవ్యా, బుచ్చమ్మ, శేకర్, ప్రసాద్, యాదమ్మ, రిజ్వన, సుభాషిణి పాల్గొన్నారు.