Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
డబుల్బెడ్రూం ఇండ్ల కోసం ఈ నెల 25వ తేదీన సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్య ంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మల్కాజిగిరి సర్కిల్ కార్యదర్శి ఎం.కృపాసాగర్ పిలుపునిచ్చారు. సోమవారం మల్కాజిగిరిలోని పార్టీ కార్యాలయంలో ధర్నా కరపత్రాల ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు, పేదలు, బలహీన వర్గాలు ఇండ్లు లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన డబుల్బెడ్ రూం ఇండ్లను వెంటనే కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామ న్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పేదలందరికి డబుల్బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని టీఆర్ఎస్ వాగ్ధానం చేసి అధి కారంలోకి వచ్చి ఏడేండ్లు దాటినా ఇప్పటికీ అర్హు లైన వారికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ భూముల్లో ఏండ్లు గా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలనీ, డబుల్బెడ్రూం ఇండ్ల దరఖాస్తులను పరిశీలించి లబ్దిదా రులను ఎంపిక చేయాలనీ, దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి అవకాశం ఇవ్వాలని కోరారు. మేడ్చల్ జిల్లాలో నిర్మా ణాలు జరిగిన డబుల్బెడ్ రూం ఇండ్లలో స్ధానికులకు 50 శాతం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మల్కాజిగిరి సర్కిల్ కమిటీ సభ్యులు గుంటి లక్ష్మణ్, పార్టీ నాయకులు సాయి, శివ, భాస్కర్ పాల్గొన్నారు.