Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
దేశంలో ఉన్న అనాథలు, నిరాశ్రయుల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ అన్నారు. ఈమేరకు సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రోడ్ల పక్కన దయనీయ స్థితుల్లో ఏ ఆధారం లేకుండా ఎందరో అనాథలు, అభాగ్యులు, మతిస్థిమితం లేని వాళ్లు ఉన్నారని తెలిపారు. వారి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కోరారు.