Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించి అవగాహన కల్పించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపిహెచ్బి డివిజన్ మలేషియన్ టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన ఇంటింటికి వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఆయన పాల్గొని ప్రారంభించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న కూడా మాస్కు, భౌతిక దూరం పాటించాలన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, డీఈ రవికుమార్ పాల్గొన్నారు.