Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి/కేపీహెచ్బీ
కూకట్పల్లి సర్కిల్ పట్టణ మహిళ సమాఖ్య సభ్యులు పలు సమస్యలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం ఇచ్చారు. అలాగే రాఖీ పండుగను పురస్కరించుకుని రాఖీకట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ మహిళ సమాఖ్య సభ్యులు మాట్లాడుతూ.. 72 సమాఖ్యలు నెలకు ఒకసారి టి ఎల్ ఎఫ్ సమావేశం జరుపుకోటానికి సరైన వేదిక లేదని, అందుకు ఒక హాల్ను ఏర్పాటు చేయాలని, శ్రీనిధి బ్యాంక్తో లింకేజ్ చేయాలని, మహిళ సమాఖ్య ప్రెసిడెంట్స్ జీతాలు వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళ సోదరీమణులకు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో కూకట్పల్లి పట్టణ మహిళ సమాఖ్య ప్రెసిడెంట్ మంజుల, సెక్రటరీ భూలక్ష్మి, కోశాధికారి స్వప్న, సమాఖ్య సభ్యులు పద్మావతి, రాధ బాయి, ఎస్. కె బీబీ , నిర్మలమ్మ, స్వరూప, శ్యామల, కష్ణవేణి, రాణి, లలిత కుమారి, సౌందర్య, వెంకటేశ్వరి, ఉమామహేశ్వరి, నాగలక్ష్మి, యోగేశ్వరి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.